ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ చేయాలి

70చూసినవారు
ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ చేయాలి
ముంచంగిపుట్టు మండలంలోని కరిముఖిపుట్ పంచాయతీ గ్రామాల్లో ఇంటింటా రేషన్ బియ్యం పంపిణీ చేయాలని పంచాయతీ గిరిజనులు జీనబంధు డొంబ్రు బుధవారం డిమాండ్ చేశారు. ముంచంగిపుట్టు నుంచి వారు మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాకంగా ఇంటింటికి పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని కరీముఖిపుట్ పంచాయతీ గ్రామాల్లో ఆరు నెలలుగా పంపిణీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అధికారులు స్పందించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్