బీజేపీ శాసనసభాపక్ష నేతగా విష్ణుకుమార్ రాజు

54చూసినవారు
బీజేపీ శాసనసభాపక్ష నేతగా విష్ణుకుమార్ రాజు
AP: బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పార్టీ విప్‌గా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఎంపికైన‌ట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. వీరిద్దరి ఎంపికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి లేఖ పంపినట్లు తెలిపారు. అసెంబ్లీలో ప్యానల్ స్పీకర్లుగా మండలి బుద్ధ ప్రసాద్, వరదరాజుల రెడ్డి, జ్యోతుల నెహ్రూ, కోళ్ల లలిత కుమారి, దాసరి సుధ, పి.విష్ణుకుమార్ రాజులను ఎంపిక చేసినట్లు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్