భీమిలి నియోజకవర్గంలో టిడిపిలోకి చేరికలు వైసీపీకి ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గురువారం ఆనందపురం మండలం ముకుందపురం, 98 వ వార్డు లోని సింహాచలం ప్రాంతాల నుంచి 200 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు సమక్షంలో టిడిపి కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న క్రమశిక్షణ కలిగిన పార్టీ అన్నారు.