మేహాద్రి గెడ్డకు జలకళ

58చూసినవారు
విశాఖ జిల్లాలో మేహాద్రి గెడ్డలో పుష్కలంగా నీరు చేరింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రిజర్వాయర్లో 49 అడుగులకు నీరు చేరింది. నెల రోజుల క్రితం 46 అడుగులు ఉన్న నీటిమట్టం మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూడు అడుగుల మేర పెరిగింది. గరిష్ట నీటిమట్టం 61 అడుగులు కాగా. ప్రస్తుతం 49 అడుగులకు చేరింది. 59 అడుగులకు చేరితే తప్ప గేట్లు ఎత్తే అవకాశం లేదు.

సంబంధిత పోస్ట్