చోడవరం.. ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతత అవసరం

50చూసినవారు
చోడవరం.. ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతత అవసరం
ఒత్తిళ్లతో నిత్యం బిజీగా ఉంటున్న ప్రజలు మానసిక ప్రశాంతత కోసం సమయాన్ని కేటాయించాలని చోడవరం ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ వినయ్ సూచించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని గురువారం చోడవరం ప్రభుత్వాసుపత్రిలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ వినయ్ మాట్లాడుతూ ప్రజలలో మానసిక ప్రశాంతత అవసరమన్నారు. ఈ సమావేశంలో న్యాయవాది కొలగాని సతీష్ మాట్లాడారు.

సంబంధిత పోస్ట్