పేట కాజ్వె పునరుద్ధరణ

55చూసినవారు
సుమారు 15 రోజులుగా మూతపడిన విజయరామరాజుపేట. వడ్డాది మధ్య గల కాజ్వే గురువారం నుంచి పునరుద్ధరించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల మూలంగా పేట తాచేరు నదిపై గల కాజ్వే కొట్టుకుపోవడంతో చోడవరం నుంచి అల్లూరు జిల్లాకు మాడుగుల నర్సీపట్నం ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే, అధికారులు తీసుకున్న చొరవతో గురువారం నుంచి యధాప్రకారం వాహనాలకు అనుమతి ఇవ్వడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు

సంబంధిత పోస్ట్