విశాఖలోని శనివారం సముద్రతీరాలు భక్తులతో కిటకిటలాడాయి. తెన్నేటి పార్కు, జోడుగుళ్లుపాలెం నుంచి సీతకొండ వరకు తీరంలో భక్తులు సందడి నెలకొంది. ఆయా బీచ్లకు సుమారు లక్షమందికి పైగా జనం వచ్చారని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం శివరాత్రి జాగారాలు చేసిన భక్తులు శనివారం సముద్రస్నానాలు ఆచరించారు. తీరప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.