ఈనెల 3వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్ తో విశాఖ వైయస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు కలకత్తా నైట్ రైడర్స్ క్రికెటర్స్ కుటుంబ సమేతంగా ఆదివారం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. బెంగళూరు నుండి సాధారణ విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న క్రికెటర్ రోడ్డు మార్గాన సిటీలో నోవటల్ హోటల్ బయలుదేరి వెళ్లారు.