కనకదుర్గమాంబ ఆశీస్సులు నగర ప్రజలపై ఉండాలి

51చూసినవారు
కనకదుర్గమాంబ ఆశీస్సులు నగర ప్రజలపై ఉండాలి
శ్రీశ్రీశ్రీ కనక దుర్గమాంబ అమ్మవారి ఆశీస్సులు నగర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు విశాఖ మేయర్ హరి వెంకట కుమారి దంపతులు పేర్కొన్నారు. మంగళవారం మేయర్ దంపతులు ఇసుకతోట హైవే పక్కన ఉన్న శ్రీ శ్రీ కనక దుర్గమాంబ అమ్మవారి పండుగ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులుప్రజలపై ఉండాలని నగరాభివృద్ధి జరగాలని కోరుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్