విశాఖ: రూ. 13 కోట్ల మ‌ద్యం తాగేశారు

71చూసినవారు
విశాఖ: రూ. 13 కోట్ల మ‌ద్యం తాగేశారు
జిల్లాలో 139 ప్రభుత్వ మద్యం దుకాణాలు, 132 బార్‌లకు ఆదివారం ఫుల్ బిజినెస్ జ‌రిగింది. ద‌స‌రా అమ్మ‌కాలు ఎక్సైజ్ శాఖ‌కు కిక్ ఇచ్చాయి. దసరా సందర్భంగా సుమారు 5, 500 కేసుల మద్యం, 4వేల కేసుల బీరు అమ్ముడైనట్టు ఎక్సైజ్‌శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణ రోజుల్లో సగటున రూ. పది కోట్లు మద్యం విక్రయాలు జరుగుంటాయి. కానీ దసరా నేపథ్యంలో రూ. 13 కోట్లు విక్రయాలు జరిగాయని ఎక్సైజ్‌శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్