పాముకాటుతో అస్వస్థతకు గురైన ఉపాధి కూలీ
గొలుగొండ మండలం పాకలపాడు గ్రామానికి చెందిన దొంగల రాజుబాబు అనే ఉపాధి కూలీ పాముకాటుకు గురయ్యాడు. శుక్రవారం ఉపాధి పనులకు వెళుతుండగా సమయంలో పాము కాటేసింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఉపాధి హామీ ఈసీ రాధిక ఆసుపత్రికి చేరుకొని సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించేందుకు ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు.