ప్రభుత్వాన్ని విమర్శించిన జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు పెట్టొద్దు: సుప్రీంకోర్టు

70చూసినవారు
ప్రభుత్వాన్ని విమర్శించిన జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు పెట్టొద్దు: సుప్రీంకోర్టు
ప్రభుత్వంపై జర్నలిస్టులు రాసిన కథనాలను విమర్శలుగా భావించి, వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టడం సరికాదని భారత సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అలా చేస్తే భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించినట్లే అవుతుందని స్పష్టం చేసింది. తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన జర్నలిస్టు అభిషేక్‌ ఉపాధ్యాయ్‌ వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

సంబంధిత పోస్ట్