చింతపల్లిలో గిరిజనుడిపై గుర్తుతెలియని దుండగుల దాడి

63చూసినవారు
చింతపల్లిలో గిరిజనుడిపై గుర్తుతెలియని దుండగుల దాడి
చింతపల్లి మండలం చెరువూరు గ్రామానికి చెందిన కొర్ర రవి శుక్రవారం ఒరిస్సా లోని చిత్రకొండ మండలం పరిధిలోని డోలియం గ్రామంలో తన చెల్లలి యోగక్షేమాలు చూసేందుకు చుట్టం చూపుగా వెళ్ళాడు. శనివారం జనతాబై వారపు సంతలో నిత్యవసర సరుకులు తీసుకుని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా గుర్తు తెలియని దుండగులు బాణందూళి గ్రామం వద్ద తీవ్రంగా దాడి చేయడంతో అపస్మారకస్థితిలోకి వెళ్ళాడు. అటుగా వెళ్లే ప్రయాణికులు చూసి ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్