విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వరకు నడుపుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్నును పూరి వరకు నడపాలని విశాఖ కాంగ్రెస్ నాయకుడు పాశర్ల ప్రసాద్ సోమవారం డిమాండ్ చేశారు. ఒకప్పుడు కళింగ రాజ్యంలో నివసించే విశాఖవాసులు పూరి జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్లడం ఒక యాత్రగా భావించేవారన్నారు. ఆ యాత్ర కొనసాగించడానికి వందే భారత్ ఎక్స్ప్రెస్ను విశాఖపట్నం నుంచి పూరి వరకు నడిపితే ప్రజలందరూ ఎంతగానో సంతోషిస్తారని పేర్కొన్నారు.