పసిఫిక్ మహాసముద్రంలోని పపువా న్యూగినీ ద్వీప దేశాన్ని పెను భూకంపం అతలాకుతలం చేసింది. తూర్పు సెపిక్ ప్రావిన్స్లో 6.9 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో వెయ్యికిపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందారు. అంబుంటి పట్టణ సమీపంలో 40 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. కాగా సెపిక్ నది వరదల కారణంగా తూర్పు సెపిక్ ప్రావిన్స్ ఇప్పటికే దెబ్బతినగా.. తాజా భూకంపంతో పరిస్థితులు మరింత దిగజారాయి.