పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2, 3 గంటల్లో ఈ పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించింది. విదర్భ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.