బెంగళూరు -గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రమాదం

67చూసినవారు
బెంగళూరు -గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి విశాఖ జిల్లా సింహాచలం మీదుగా వచ్చే సమయానికి బోగి ఎస్7లో ఒక్కసారిగా పొగ రావడంతో రైలు ఆపేశారు. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సింహాచలంలో రైలు ఆపి పొగలను అదుపుచేశారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో వుంది.

సంబంధిత పోస్ట్