తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని నది దాటి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటర్లు తమ ఓటు వేశారు. కొమరాడ మండలంలో నాగావళి నది దాటి కూనేరు పోలింగ్ కేంద్రానికి రెబ్బ గ్రామస్తులు వెళ్లి.. తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.