వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తి చేశారు. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, అందరూ కలిసిమెలిసి వైసీపీని గెలిపించి మళ్లీ జగన్ను సీఎం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు వైసీపీ అభ్యర్థులు అంతా పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు.