విజయవాడ క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామనాయుడును విజయవాడ ఎంపీ కేశనేని శివనాథ్ (చిన్ని), జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కడప ఎమ్మెల్యే రెడ్డప్ప, మాధవిలు వారి వారి పరిధిలోని సాగునీటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి సాగునీటి సమస్యలను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.