మట్టి గణనాధుల విగ్రహాలు పంపిణీ చేసిన సీఐ

79చూసినవారు
మట్టి గణనాధుల విగ్రహాలు పంపిణీ చేసిన సీఐ
వినాయక చవితి సందర్భంగా గౌతమ్ డెవలపర్స్ మరియు తణుకు సిటీ పేజీ ఆధ్వర్యంలో శనివారం వేల్పూరు రోడ్డులో ఉచిత మట్టి గణనాథుల పంపిణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తణుకు రూరల్ సిఐ జి. నాగేశ్వర రావు హాజరయ్యారు. అనంతరం ప్రజలకు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు మట్టి గణపతిని పూజించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్