ఏలూరు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా బడేటి రాధాకృష్ణయ్య మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏలూరు ఫైర్ ఆఫీసర్ సెంటర్లోని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం నుండి భారీ ర్యాలీని నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు ప్రారంభించారు. అనంతరం అక్కడ నుండి ర్యాలీగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను బడేటి సమర్పించనున్నారు.