చంద్రబాబు పనితీరు అమోఘం

62చూసినవారు
ముంపునకు గురైన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు పనితీరు అమోఘంగా ఉందని ఏలూరు జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు ప్రశంసించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి విపత్కర పరిస్థితి తలెత్తిందన్నారు. ఏజెన్సీ ప్రాంతాలు చాలా తీవ్రంగా ముంపునకు గురైందన్నారు. ఎన్నడూ లేనివిధంగా విజయవాడ మహానగరంలో పెద్ద పెద్ద బంగ్లాలు సైతం మునిగిపోయాయన్నారు.

సంబంధిత పోస్ట్