బాలికపై అత్యాచారయత్నం ఘటనలో నిందితుడికి రిమాండ్

62చూసినవారు
బాలికపై అత్యాచారయత్నం ఘటనలో నిందితుడికి రిమాండ్
పోక్సో కేసులో నరసాపురం పట్టణంలోని 24వ వార్డుకు చెందిన నల్లి శ్రీనివాస్ అనే వ్యక్తిని బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు నరసాపురం టౌన్ సీఐ బి. యాదగిరి చెప్పారు. శ్రీనివాస్ తన ఇంటి ఎదురుగా రోడ్డుపై ఆడుకుంటున్న ఓ బాలిక(9)ను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడన్న ఫిర్యాదుపై మంగళవారం కేసు నమోదు చేశారు. నిందితుడిని బుధవారం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్