ఎమ్మెల్యేతో కరచలనం చేసేందుకు ఎగబడిన విద్యార్థులు

561చూసినవారు
నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తో కరచలనం చేసేందుకు విద్యార్థులు ఎగబడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు సోమవారం విద్యాసామాగ్రి కిట్లను పంపిణీ చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే నాయకర్ తో కరచలనం చేసేందుకు విద్యార్థులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో ఎమ్మెల్యే నాయకర్ కంగారు పడకండి అంటూ విద్యార్థులు అందరితో కరచాలనం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిపి ఫోటోలు దిగారు.

సంబంధిత పోస్ట్