మూడో గండి పూడిక పనులు పూర్తి

68చూసినవారు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు బుడమేరు గండ్ల పూడిక ప్రాంతంలో మంత్రి రామానాయుడు గత మూడు రోజులుగా పడుతున్న శ్రమ ఫలించింది. ఎట్టకేలకు శ్రమించి బుడమేరు మూడవ గండిని కూడా పూడ్చడం పూర్తి చేసినట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శనివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విజయవాడ సింగ్ నగర్ కు వరద నీరు రావడం ఆగిపోయిందని మంత్రి నిమ్మల ప్రకటించారు.

సంబంధిత పోస్ట్