నేటి నుంచి కొండేపాడు కనకదుర్గమ్మ జాతర

55చూసినవారు
నేటి నుంచి కొండేపాడు కనకదుర్గమ్మ జాతర
పెంటపాడు మండలం బి. కొండేపాడు గ్రామ ఇలవేల్పు కనకదుర్గమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈనెల 17 నుంచి 28 వరకు జరుగుతాయని ఆలయ ఈవో శోభనాద్రి తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ పునఃనిర్మాణం జరుగుతోందన్నారు. 17 రాత్రి అమ్మవారి జాతర, 22న అంకురార్పణ, 23న అమ్మవారి కల్యాణ మహోత్సవం, 24న అమ్మవారి దివ్యరథోత్సవం, తీర్థం, 26న గ్రామ బలిహరణ, 28న త్రిశూల స్నానం కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :