ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరగవరం మండలంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా రైతులను పరామర్శించిన ఆయన వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వారు చేస్తున్న పని పాటల్లో కాసేపు నిమగ్నమై వారితో ముచ్చటించారు. మంత్రి కారుమూరి వెంట పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు.