తణుకు: మహిళా మార్ట్ ను పరిశీలించిన జెసి టి.రాహుల్ కుమార్ రెడ్డి

80చూసినవారు
తణుకు: మహిళా మార్ట్ ను పరిశీలించిన జెసి టి.రాహుల్ కుమార్ రెడ్డి
మహిళా మార్ట్ ద్వారా ఎక్కువ ఆదాయం ఆర్జించేలా మరింత కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం తణుకు రూరల్ మండలం వేల్పూరు పంచాయితీ వద్ద ఉన్న మహిళా మార్ట్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. మహిళా మార్ట్ ను నిర్వహిస్తున్న మహిళలతో మాట్లాడి రోజువారి వ్యాపారం గురించి ఆరా తీశారు. అలాగే సేల్స్ ను పెంచేందుకునేందుకు కొత్త ఆలోచన చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్