ప్రతిష్టకు ముస్తాబైన అమ్మవార్ల ఆలయం
చాట్రాయి మండలం ఆరుగొలనుపేట గ్రామంలో వేంచేసి ఉన్న లక్షమ్మ అంకమ్మ అమ్మవారి దేవాలయం పునర్నిర్మాణం పనులు చురుగ్గా సాగుతుండగా త్వరలోనే ప్రతిష్టకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 26వ తేదీ కల్లా పూర్తి చేసి ప్రతిష్ట చేయాలని ఆలయ కమిటీ యోచిస్తున్నట్టు కమిటీ ఆదివారం తెలిపారు. సుమారు 104 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన శ్రీ లక్ష్మమ్మ అంకమ్మ దేవాలయం శిథిలావస్థకు చేరడంతో నూతన ఆలయం నిర్మాణం కోసం శ్రీకారం చుట్టారు.