వెటర్నరీ డాక్టర్ పై దాడి
చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీకి చెందిన వెటర్నరీ డాక్టర్ చందర్ రావుపై నాగిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన ఇస్లావత్ చంద్రశేఖర్ కుటుంబీకులు శనివారం రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. గాయపడిన వ్యక్తిని స్థానికుల సహాయంతో చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సదరు వెటర్నరీ డాక్టర్ మాట్లాడుతూ. చంద్రశేఖర్ కుటుంబంతో ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు.