పిన్నెల్లి ఎందుకు పారిపోయారు: జూలకంటి

83చూసినవారు
పిన్నెల్లి ఎందుకు పారిపోయారు: జూలకంటి
హింసను ప్రేరేపించేలా అనేక వేదికల్లో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని.. టీడీపీ నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు, జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. గుంటూరులో జూలకంటి మాట్లాడుతూ.. ‘పల్నాడు జిల్లాలో హింసపై ముందుగానే అప్రమత్తం చేశాం. ఈసీ కేవలం సమస్యాత్మక ప్రాంతాలను ప్రకటించి మౌనంగా ఉంది. ఎన్నికల తర్వాత దాడులు చేస్తామని పిన్నెల్లి పదేపదే హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలపై పోలీసులు చర్యలు తీసుకోలేదు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్