తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

55చూసినవారు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతో వైకుంఠ క్యూ కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోవడంతో వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. సోమవారం ఒక్క రోజే శ్రీవారిని 85,825 మంది భక్తులు దర్శించుకోగా, 36,146 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండి ఆదాయం 4.4 కోట్లు వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్