వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఐదు సీట్లు కూడా రావని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు. ఆ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామంటే ఒప్పుకోబోమని, తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలిపారు. దోచుకున్న రూ.లక్షల కోట్ల డబ్బును జగన్ బెంగళూరు ప్యాలెస్లో దాచుకున్నారని ఆరోపించారు. ఆ ప్యాలెస్పై రైడ్ చేయకుండా సీబీఐ, సీఐడీ, ఏసీబీ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. జగన్ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా చెక్ చేయాలని డిమాండ్ చేశారు.