వైసీపీ అరాచకానికి అదుపు లేకుండా పోయింది: లోకేశ్

54చూసినవారు
వైసీపీ అరాచకానికి అదుపు లేకుండా పోయింది: లోకేశ్
వైసీపీ మూకల అరాచకానికి అడ్డూ అదుపు లేకుండా పోతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. మంగళవారం నారా లోకేశ్ మాట్లాడుతూ.. ‘ఐదేళ్ల జగన్ పాలనలో ప్రశాంతంగా జీవనం సాగించలేని పరిస్థితి నెలకొంది. ఆటవిక చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాకినాడ శివాలయంలో పూజ సరిగ్గా చేయలేదని అర్చకులపై వైసీపీ నేత చంద్రరావు దాడి చేయడం దుర్మార్గం. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి.’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్