విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నది వైసీపీ నేతలేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. శనివారం విజయవాడ టీడీపీ వర్క్షాప్లో మాట్లాడుతూ.. కూనం వీరభద్రరావుకు వైసీపీ నాయకులతో సంబంధాలున్నాయన్నారు. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జగన్, వైసీపీ నేతల ఫోటోలున్నాయని, వైసీపీ నాయకులతో నిందితులకు సంబంధాలున్నాయనే విషయం ప్రజలకు తెలుసన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం గంజాయికి కేరాఫ్గా మారిందని మండిపడ్డారు.