భీమిలీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు చేదు అనుభవం ఎదురైంది. పద్మనాభం మండలంలో అవంతి ప్రసంగానికి అడుగడుగునా స్థానిక మహిళలు, యువకులు అడ్డుపడ్డారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని, ఎలాంటి సమస్యలూ పరిష్కరించలేదని నిలదీశారు. దాంతో అవంతి శ్రీనివాసరావు బిత్తరపోయారు. ప్రచారాన్ని ముగించి అవంతి శ్రీనివాసరావు వెనుతిరిగారు.