రెబల్ ఎమ్మెల్యేలు ఈరోజు విచారణకు హాజరు కావాలని స్పీకర్ తమ్మినేని సీతారం నోటీసులు పంపారు. అయితే విచారణకు హాజరు కాలేమని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. చీఫ్ విప్ ప్రసాదరాజు సమర్పించిన ఆధారాలు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం చెల్లవని సమాధానం ఇచ్చారు. ఆయా సంస్థల నుంచి సర్టిఫైడ్ కాపీలను ఇవ్వాలని స్పీకర్ ను లేఖలో కోరారు. స్పీకర్ వారిపై వేటు వేస్తారా? మరో అవకాశం కల్పిస్తారా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.