కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల మండిపాటు

70చూసినవారు
కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల మండిపాటు
కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసి.. వైద్య విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలని చూస్తున్నారా?. ఇప్పటికే అందని ద్రాక్షలా మారిన వైద్య విద్యను పేద విద్యార్థులకు మరింత దూరం చేసే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా?. గుజరాత్ పీసీసీ విధానంపై ఎందుకు అధ్యయనం చేయాలని అనుకున్నారని, దీనిపై జరుగుతున్న ప్రచారంపై సీఎం చంద్రబాబు నోరు విప్పాలి.’ అని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్