డగ్స్ రహిత సమాజాన్ని నిర్మించుకోవడంలో యువత భాగస్వామ్యం కావాలని.. గ్రేటర్ రాయలసీమ విద్యార్థి యువజన సమాఖ్య యువతను చైతన్యం చేయడం అభినందనీయమని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి కొనియాడారు. గ్రేటర్ రాయలసీమ విద్యార్థి యువజన సమాఖ్య ముద్రించిన ‘ఓ యువత డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటు పడదాం‘ అనే కరపత్రంను ఎమ్మెల్యే, అపుస్మా జిల్లా అధ్యక్షులు బాలవికాస్ గంగయ్య, గ్రేటర్ రాయలసీమ విద్యార్థి యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.ఎం. ఓబులేసు యాదవ్ ఆవిష్కరించారు.