రాజుపాలెంలో రేషన్ బియ్యం స్వాధీనం

85చూసినవారు
రాజుపాలెంలో రేషన్ బియ్యం స్వాధీనం
రాజుపాలo మండలంలోని వెలవలి గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న 92 బస్తాల రేషన్ బియ్యాన్ని శుక్రవారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ కత్తి వెంకటరమణ తెలిపారు. దువ్వూరుకు చెందిన దస్తగిరి అనే వ్యక్తి అక్రమంగా క్యాంపర్ వాహనంలో రేషన్ బియ్యాన్ని తరలిస్తూ ఉండగా పట్టుకున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. రేషన్ బియ్యం తరలిస్తున్న క్యాంపర్ వాహనం, 92 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్