కబడ్డీ క్రీడలో కోదాడ జట్టు రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థాయిలో నిలవాలి-ఎజిపి గట్ల నర్సింహరావు

164చూసినవారు
కబడ్డీ క్రీడలో కోదాడ జట్టు రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థాయిలో నిలవాలి-ఎజిపి గట్ల నర్సింహరావు
కబడ్డీ క్రీడలో కోదాడ జట్టు, రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థాయిలో నిలపాలని ఎజిపి గట్ల నర్సింహరావు అన్నారు. శుక్రవారం బాలుర ఉన్నత పాఠశాలలో, మహబూబ్‌నగర్ జిల్లాలో జరుగనున్న జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీల దృష్ట్య, ఉమ్మడి నల్గొండ జిల్లా కబాడీ అసోసియేషన్ అద్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంపును ఆయన ప్రారంభించి మాట్లాడారు .క్యాంపును మహాశక్తి కబాడీ శిక్షణ కేంద్రం నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కబాడీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ బాగ్దాద్, నియోజకవర్గ కన్వినర్ సయ్యద్ రఫి, కోచ నాగుల మీరా, మెనేజర్ విజయ్, కౌన్సిలర్లు షమ్మి, షఫి, కాంపాటి శ్రీను, విశ్రాంత ప్రధానోఫాధ్యాయులు ముత్తవరపు రామారావు, పిఈటీ లు నాగెశ్వరావు, యశ్వంత్, రామారావు, బద్రం, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్