ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో పది మంది నక్సలైట్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. వారిలో ఒకరి తలపై రూ.లక్ష రివార్డు ఉందన్నారు. దులేద్ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో వీరిని పట్టుకున్నట్లు సుక్మా పోలీసు సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ వెల్లడించారు. పోలీసులు, CRPF ఎలైట్ కోబ్రా యూనిట్లోని 204, 206, 208వ బెటాలియన్లు సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా వీరు పట్టుబడ్డారన్నారు.