యూపీలో చెప్పుల వ్యాపారులే లక్ష్యంగా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఏ మూలన చూసినా నోట్ల కట్టలే దర్శనమివ్వడంతో షాక్ అయ్యారు. ఆగ్రాలోని ముగ్గురు చెప్పుల వ్యాపారులకు చెందిన 14 ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహించగా కోట్ల కొద్దీ డబ్బును అధికారులు గుర్తించారు. కేవలం 42 గంటల్లోనే రూ.100 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.