చైనాలో లంచాలతో రూ.1,264 కోట్లు ఆర్జించిన ఓ బ్యాంకర్కు స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది. చైనా హువరాంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్లో జనరల్ మేనేజర్గా పనిచేసిన బాయ్ తియాన్హై ప్రాజెక్ట్లు, ఫండ్స్ మంజూరు చేసేందుకు లంచాలు తీసుకునేవాడు. ఈ నేరాలను తీవ్రంగా పరిగణించిన కోర్టు మరణశిక్ష విధించింది. కాగా 2021లో అతని మాజీ బాస్ సైతం ఇలాగే అవినీతికి పాల్పడి మరణశిక్షను ఎదుర్కొన్నాడు.