శ్రీవారి దర్శనానికి 20 గంటల స‌మ‌యం

78చూసినవారు
శ్రీవారి దర్శనానికి 20 గంటల స‌మ‌యం
క‌ళియుగ వైకుంఠం తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి శిలాతోరణం వరకు భ‌క్తులు క్యూలో నిలుచున్నారు. శ్రీ‌నివాసుని దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. కాగా, నిన్న 70,668 మంది భ‌క్తులు వెంక‌న్న ద‌ర్శ‌నం చేసుకున్నార‌ని టీడీడీ అధికారులు తెలిపారు. 38,036 మంది తలనీలాలు సమర్పించారని చెప్పారు. హుండీ ఆదాయం రూ.3.64 కోట్లుగా లెక్క తేలింద‌ని వివ‌రించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్