కర్ణాటకలో అదుపుతప్పి బోల్తా పడ్డ బస్సు, 20 మందికి తీవ్రగాయాలు (వీడియో)

78చూసినవారు
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగుళూరు- మైసూర్ ఎక్స్‌ప్రెస్ హైవే నుంచి మాండ్య వైపు సర్వీస్ రోడ్డులో అతివేగంతో వెళుతున్న బస్సు సోమవారం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను చికిత్సా నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్