క్రిప్టో కరెన్సీ పేరుతో సైబర్ మోసానికి పాల్పడిన లక్షయ్ విజ్(33) అనే వ్యక్తిని ఈడీ జూలై 22 అరెస్ట్ చేసింది. లిసా రోత్ అనే అమెరికా మహిళ వద్ద 3.3 కోట్లు దొచుకున్నట్లు లక్షయ్పై ఈడీ ఆరోపణలు చేసింది. అనంతరం అతన్ని ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు జూలై 28 వరకు ఈడీ కస్టడీ విధించింది. సదరు మహిళ వాడుతున్న బ్యాంక్ అకౌంట్ సురక్షితం కాదని నమ్మించి.. క్రిప్టో కరెన్సీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి బ్యాంక్ ఖాతా ఖాళీ చేశాడు.