దేశంలోని కోట్లాది ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 'పీఎం సూర్య ఘర్' పథకాన్ని ప్రవేశపెట్టింది. ఒక్కో ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. దీని కోసం pmsuryaghar.gov.inలో దరఖాస్తు చేసుకోండి, మీ పేరు, రాష్ట్రం, మొబైల్ నంబర్, మెయిల్ ఐడి, విద్యుత్ వినియోగదారు సంఖ్యను నమోదు చేయండి. ఆ తర్వాత రూఫ్టాప్ సోలార్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అనుమతి పొందిన తర్వాత సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవాలి.