ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లాలో 33 మంది కీలక మావోయిస్టు నాయకులు ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్, సీఆర్పీఎఫ్ అధికారుల ఎదుట శనివారం లొంగిపోయారు. వీరిలో కీలక నాయకులు రాజు హేమ్లా, సుద్రు పూనెం, సుఖ్రామ్ మడవి, సురేశ్ కుంజం, ఐతూ పూనెం ఉన్నారు. లొంగిపోయిన వారిలో ఒక్కొక్కరిపై రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రివార్డు ఉంది.